పాండవులకి మార్కండేయ మహర్షి ద్వారా ధర్మబోధ చేపిన శ్రీకృష్ణుడు


కొంతకాలం తరువాత పాండవులు అరణ్య వాసంలో ఉండగా శ్రీకృష్ణుడు పాండవులని పలకరించటానికి సత్యభామను కొంతమంది యాదవపరివారాన్ని తీసుకొని వెళ్లారు. శ్రీకృష్ణుడిని చూసిన పాండవులు సంతోషించి సాధారంగా ఆహ్వానించి కూర్చోపెట్టారు. కుశలప్రశ్నలు అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులను పలకరించి ద్రౌపది పుత్రులు ఇప్పుడు మాదగ్గరే ఉన్నారు. నా కుమారుడు ప్రద్యుమ్నుడు వారికీ యుద్ధంలో శిక్షణ ఇస్తున్నాడు. అభిమాన్యుడితో కలిసి సంతోషంగా ఉన్నారు. మీరు వారిమీద బెంగపెటుకోవద్దు అని చెప్పారు. వారి కుమారులు శ్రీకృష్ణుడి దగ్గర సంతోషంగా ఉన్నారు అని తెలుసుకొని పాండవులు ద్రౌపది సంతోషించారు. శ్రీకృష్ణుడు వచ్చాడు అని తెలుసుకొని మార్కండేయ మహర్షి శ్రీకృష్ణుడిని పాండవులను చుడటానికి వచ్చారు. ధర్మరాజు మార్కండేయ మహర్షిని చూసి సాధారంగా ఆహ్వానించారు. శ్రీకృష్ణుడు మార్కండేయ మహర్షికి నమస్కరించి మార్కండేయ మహర్షి! కురుపాండవులకు భవిష్యుత్తులో యుద్ధం రానున్నది. వారికీ ధర్మభోద చేయమని చెప్పారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు విష్ణుభగవానుడు అని తెలుసు కాబ్బటి అయన సమక్షంలో తనకు పురాణం, ధర్మాబోధ చేసే అవకాశం దక్కినందుకు సంతోషించాడు. ధర్మరాజుకు అతని తమ్ముళ్లకు ధర్మరాజు దగ్గర ఉన్న 10,000మంది పురోహితులకు చెప్పటం మొదలు పెట్టారు. మార్కండేయ మహర్షి వారికీ యుగాలా గురించి యుగదర్మాల గురించి సంకటపరిస్థితులలో ఎలా ధర్మ పాటించాలి అని చెప్పారు. అంత వినా ధర్మరాజు మహర్షికి నమస్కరించి మహర్షి!మీరు చిరంజీవులు కదా మీ వయస్సు కల్పంతాలు కదా మీకన్నా పెద్దవారు ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పండి అని అడిగారు. అందుకు మార్కండేయ మహర్షి తనకన్నా పెద్దవారు ఈ భూమిపై ఇంకా ముగ్గురు ఉన్నారు అని వారి గురించి వివరించిన కథలో దానం వలన వచ్చిన ఫలితం గురించి చెప్పారు. తరువాత ధర్మరాజు మహర్షి! మీరు కల్పంతా వయస్సు ఉంది కదా మీరు ఇప్పటివరకు ఎన్నో ప్రళయలు చూసారు కదా దానిగురించి మాకూ వివరించండి అని అడిగారు. అప్పుడు మహర్షి మత్యావతారం గురించి వివరించారు. అంతకు ముందు ప్రళయంలో ములోకలు భూమండలం అన్ని జలమయం అయిపోయాయి. నక్షత్రాలు, గ్రహాలు సూర్యచంద్రులు ఇంధ్రుడు దిక్పాలకులు అందరు నశించిపోతారు. బ్రహ్మదేవుడికి అప్పుడు రాత్రికాలం బ్రహ్మదేవుడు నిద్రకు ఉపక్రమిస్తారు. ఎట్టు చుసిన అంత శున్యం చీకటి ఆ జలలలో అల్లలలో తేలను కొంతకాలం నీళ్లలో ఈదాను ఇంకా ఓపిక నీశించి పోయింది. మనస్సులో శ్రీమన్నారాయనూడిని తలచుకున్నాను. అంతలోనే అంత చీకటిలో ఇంకా వెలుగు కనిపించింది. ఆ వెలుగును చూసి ఇంత చీకటిలో వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అని ఆ వెలుగు దగరకు వెళ్ళాను. అక్కడ ఈ ఆధారం లేకుండా ఒక మర్రి చెట్టు ఉంది. ఈ నీళ్లలో ఈ చెట్టు ఎలావచ్చింది అని చూస్తూ ఉండగా ఆ మర్రి చెట్టు లోని ఒక ఆకు మీద ఒక చిన్న పసిబాలుడు తన కాలి బొట్టనా వెళుని నోట్లో పెట్టుకొని చీకుతూ కనిపించాడు. నేను ఈదుకుంటూ ఆ బాలుడి దగరకు వెళ్ళాను. ఆ బాలుడు నన్ను చూసి ఏమిటి అలసిపోయావా!బయపడుతున్నావా!అన్నారు. అంత చిన్న బాలుడు మాట్లాడుతున్నాడు ఏమిటి అని అశ్చర్యపోయాను అవును అన్నాను. అయితే నా నోట్లోకి వెళ్లి విశ్రాంతి తీసుకో అన్నాడు. అప్పుడు నేను నీది చిన్న నోరు నేను ఎలా నీ నోట్లో పడతాను అన్నాను. అప్పుడు ఆ చిన్న బాలుడు నోరు తెరిచారు. ఆ నోరు ఎరగా సమస్త బ్రహ్మాండాలు పటేలా తెరిచాడు. నేను అందులోకి ప్రవేశించాను. నేను పొట్టలోకి వెళ్ళాను. ఆ పొట్టలో సూర్యచంద్రులు, దిక్పాలకులు, ఇంధ్రుడు, సమస్తదేవతలు, 14లోకాలు, బ్రహ్మ, రుధ్రుడు అందరు అందులోనే ఉన్నారు. నేను కొంతసేపు పాతాళంలో కూర్చున్న మరికొంతసేపు భూలోకంలో కూర్చునా మరికొంతసేపు స్వర్గంలో కూర్చునా ఇంకా ఎక్కడ నిలవలేక బయటకు వచ్చాను. అప్పుడు నాకు అర్ధం అయింది. సమస్త బ్రహ్మడాలను తన పొట్టలో దాచుకొని ఎక్కడ చిన్న పిల్లవాడిగా ఉన్న ఈ బాలుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని ఆయనకు స్తోత్రం చేసి నమస్కరించాను. ఇంకా భయపడకు మళ్ళీ మొదలయే సమయం వచ్చింది. బ్రహ్మ ఇప్పుడు నిద్రాలేస్తాడు. అని చెప్పారు. ఆ మహానుభావుడే ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడి రూపములో మనపక్కనే ఉన్నారు. నేను ఆ విషయాలను మరచి పోయాను. శ్రీకృష్ణుడు నాకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టే నేను ఇవి అన్ని మీకు చెప్పగలుగుతున్నాను అని చెప్పారు. కొంతకాలం తరువాత మార్కండేయ మహర్షి శ్రీకృష్ణుడిని అనుమతి అడిగి అక్కడినుండి వెళ్లిపోయారు. మరికొంతకాలం తరువాత అక్కడికి దుర్వస మహర్షి వచ్చారు. ధర్మరాజు వారిని సాధారంగా ఆహ్వానించి కూర్చోపెట్టారు. దూర్వసుడు ధర్మరాజుతో మేము శిష్యసమేతంగా నీ ఇంటికి అతిధ్యానికి వచ్చాము. మేము నదికి వెళ్లి స్నానం సంధ్యా ముగించుకొని వస్తాము ఏర్పాట్లు చేయి అని నదికి వేళ్ళిపోయాడు. అప్పటికే అందరి భోజనాలు అయిపోయి చివరికి ద్రౌపది కూడా భోజనం చేసింది. ఇంకా అక్షయ పాత్రనుంచి భోజనం రాదు అందరు కంగారు పడుతుండగా ద్రౌపది వెళ్లి తమని రక్షించమని శ్రీకృష్ణుడిని వేడుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్లి అక్షయపాత్ర తీసుకురా అంటాడు. ద్రౌపది వేళ్లి అక్షయపాత్రను తీసుకువస్తుంది. శ్రీకృష్ణుడు దానిని తీసుకొని చూడగా అందులో ఒక మెతుకు ఉంటుంది. దానిని తీసుకొని శ్రీకృష్ణుడు నోటిలో వేసుకుంటాడు. శ్రీకృష్ణుడు అల నీటిలో వేసుకోగానే భూమిమీద ఆకలితో ఉన్న వారందరికీ ఆకలి తీరుతుంది. అక్కడ నది వడ్డున ఉన్న దూర్వశమహామునికి అయన శిష్యులకు ఆకలి తిరిగి బుక్తయాసంతో తేనుపులు వస్తాయి. వారు ధర్మరాజు దగరకు వచ్చి ఇంకా ఈ పూట ఏమి తినలేము. నేను నిన్ను పరీక్షంచటానికి వచ్చాను. కానీ ఈ శ్రీకృష్ణుడు నా ఆకలిని తీర్చేశాడు. అయినా శ్రీకృష్ణుడు ఎటువైపు ఉంటే అటువైపు ధర్మం ఉంటుంది. భవిష్యత్తు యుద్ధంలో మీకు విజయం తద్యం అని ఆశీర్వాదించి వెళ్లిపోయారు. మరికొంతకాలం శ్రీకృష్ణుడు అక్కడే ఉండి తరువాత ద్వారకకు వెళిపోయాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...